Sunday, October 26, 2008

సాలూరు రాజేశ్వర రావు- ర’సాలూరు’ రాజే’స్వర’ రావు





“మెలొడీ” అనే మాట వినగానే సినీ సంగీతాభిమానులందరూ ఏకాభిప్రాయంతో తల్చుకునేది సాలూరు రాజేశ్వర రావు గారిని అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. శాస్త్రీయ సంగీతంలో దిట్ట అయిన ఆయన శాస్త్రీయ, లలిత సంగీతాల సమ్మేళనంగా ఆణిముత్యాల్లాంటి మధుర సినీ గీతాలను అసంఖ్యాకంగా మనకి అందించారు. అనేక ప్రయోగాలను చేశారు. కొన్ని గీతాలను ఇంగ్లీష్ గీతాలనుంచి ప్రేరణ పొంది కొద్ది చాయలతో మాత్రమే వాటిని అచ్చ తెలుగు పాటలుగా మలిచారు. పాశ్చాత్య సంగీత ధోరణులను తొలిసారిగా తెలుగు సినీ రంగంలో ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. చంద్ర లేఖ సినిమా ఇందుకు ఒక ఉదాహరణ.

ఆలిండియా రేడియోకి సోలో గానూ, రావు బాల సరస్వతి తోనూ కలిసి ఆయన పాడిన లలిత గీతాలు 1940 ల్లో యువ హృదయాలను ఉర్రూతలూగించాయి. “పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకునటుల”…”చల్ల గాలిలో యమునా తటిలో..” “ఓ యాత్రికుడా..” వంటి పాటలు ఈ నాటికీ ఆయన సంగీతాన్ని అభిమానించే వారికి గొప్ప ఆస్థి కిందే లెక్క! స్త్రీ స్వరపు పోలికలు కలిగిన సన్నని స్వరంతో ఆయన పాడిన లలిత గీతాలు ఆలిండియా రేడియో పుణ్యమా అని సంగీతాభిమానుల దాహార్తి తీర్చాయి.

సినిమాల్లో ఆయన ప్రావీణ్యం కొత్త పుంతలు తొక్కి, మెలొడీకి పెద్ద పీట వేయడమే కాక, కొన్ని సినిమాలను ఈ నాటికీ మ్యూజికల్ హిట్లు గా నిలబెట్టింది.తెలుగు సినిమా సంగీతాన్ని ఆరాధనీయమైన స్థాయికి తెచ్చింది రాజేశ్వర రావు గారేనన్నా అతిశయోక్తి కాదు.

సినిమా పాటలకు బాణుల్ని సమకూర్చే విషయంలో రాగాలతో ఆయన అలవోకగా ఆడుకున్నారు. రాగ లక్షణాన్ని కూడా మార్చేసి దుఃఖాన్ని స్ఫురింపజేసే రాగంలో నృత్య గీతాలకు కూడా బాణీలను కట్టారు. అలాంటి అచంచల ప్రయోగాల్లో మచ్చుకు కొన్ని….


మిగిలిన్ భాగం ఇక్కడ చదవండి

http://navatarangam.com/2008/10/saluru-rajeswara-ra/

No comments: