భారత సినీ పరిశ్రమ గర్వించతగ్గ ప్రముఖులలో ఒకరైన బి.ఆర్ చోప్రా(94) ఈ ఉదయం 8.15 నిముషాలకు ముంబయి, జుహు లోని తన స్వగృహంలో మరణించారు. గత కొంత కాలంగా అస్వస్ధతకుతో బెడ్ రెస్ట్ లో ఉన్న ఈ సిని కురు వృధ్ధుడు మరణానికి బాలీవుడ్ మొత్తం నీరాజనాలు అర్పిస్తోంది. ఆయన తన బి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై కెరీర్ లో క్లాసిక్ లుగా పరిగణించతగ్గ నయా దౌర్,ఏక్ హి రిస్తా,కానూన్,ధూల్ క ఫూల్,గుమ్రాహ్ వంటి చిత్రాలును రూపొందించారు.
కుటుంబ విలువలు,సామాజిక అంశాలుతో సినిమాలు నిర్మించటమన్నా,దర్శకత్వం వహించమన్నా ఆసక్తి చూపేవారు.అలాగే 1985 లో తన బ్యానర్ పై మహాభారత్ టీవీ సీరియల్ నిర్మించి సంచలనం సృష్టించారు. ఇక ఈయన సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గానూ 1998లో భారత ప్రభుత్వం దాదా ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఈ సాయింత్రం జుహు స్మసానవాటికలో 4.30 కు దహన సంస్కారాలు ఏర్పాటు చేస్తున్నారు.
రచన; సూర్య ప్రకాష్
మిగిలిన భాగం ఇక్కడ చదవండి
http://navatarangam.com/2008/11/b-r-chopra/
బి.ఆర్ చోప్రా గురించి….
No comments:
Post a Comment